కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్
కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి ఖేల్ గావ్ సిసిఎల్ ఠాగూర్ విశ్వనాథ్ ఇండోర్ స్టేడియంలో 23 నుండి 26 వరకు కోల్ ఇండియా లెవెల్ షటిల్ బ్యాట్మెంటిన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జ్ డిజియం పర్సనల్ బి సుదర్శన్ శనివారం తెలిపారు. ఈ కోల్ ఇండియా పోటీలలో సింగరేణి జట్టు పాల్గొననున్నదని ఈ జట్టుకు మేనేజర్ గ ఏ రాజేశ్వర్ పర్సనల్ మేనేజర్, జట్టు కోచ్ గా హెచ్ రమేష్ స్పోర్ట్స్ సూపర్వైజర్ లు వ్యవహరిస్తారని అన్నారు. జట్టు క్రీడాకారులు ఆర్జీ గ్రూప్ నుండి డి విజయ్ కుమార్, కుసుమ, స్వరూప, భూపాలపల్లి గ్రూప్ నుండి సారంగపాణి, శంకరయ్య ఎన్ సురేష్, హెడ్ ఆఫీస్ నుండి పి వివేక్, వర్ధన్, కార్పొరేట్ నుండి కె శైలజ, బెల్లంపల్లి ఏరియా నుండిఎస్ కే అంకుష్ పాల్గొంటున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment