కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 11 ; రెబ్బెన మండల కేంద్రంలోని సీతారామాంజనేయ ఆలయంలో మున్నూరుకావు సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నంబాల సర్పంచ్ సోమశేఖర్ ఖైర్ గామ్ సర్పంచ్ మాన్యం కార్తిక్, రాజారాం ఓరుగంటి మల్లేష్ తో పాటు పలువురు సర్పంచ్ లను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లు మాట్లాడుతూ మున్నూరుకాపు కులస్థులు రాజకీయంగా మరింత ఎదగాలని కోరారు. అందరూ ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు.. గ్రామాల్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులుపూదరి సాయికిరణ్, రవీందర్ సృజన్ వెంకటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment