

రెబ్బెన ; మహా శివరాత్రి సందర్భంగా బుధవారం శైవ క్షేత్రాలలో శివ నామ స్మరణ మరు మ్రోగాయి. రెబ్బెన మండలము లోని నంబాల గ్రామము లో గల ప్రసన్న పరమేశ్వర ఆలయ జాతర రంగ రంగ వైభవంగా సాగింది. ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండ్లపై, , మోటారు సైకిళ్లపై తరలి వచ్చారు భక్తులు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు. ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు. కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .ఈ కళ్యాణములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు. ఈ పూజలలో దంపతులు స్వామి వారి కళ్యాణం లో పాల్గొన్నారు. . స్వామివారికి ప్రత్యక పూజలు నిర్వహించారు. ఈ జాతర లో వచ్చిన భక్తులకు కొంతమంది దాతలు అన్నప్రసాద వితరణ గావించారు. . భక్తుల కు ఎలాంటి అసౌ కర్యాలు కలగకుండా ఆలయ కమిటి అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాణా కొరకు ప్రత్యక బస్సులు నడిపారు .ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ పోలీసుశాఖవారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కన్నుల పండుగగా రధోత్సవం ;-
రెబ్బెన ; శివ పర్వతుల రధోత్సవం ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ కార్యక్రమంలో లో భక్తులు తండోప తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రధోత్సవం లో పాల్గొన్నారు. శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది. అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు. సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు. రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను మంత్ర ముగ్దులను చేసింది. అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ స్మరణతో జాగరం చేస్తూ గడిపారు.
No comments:
Post a Comment