Thursday, 14 February 2019

మూఢనమ్మకాలపై అవగాహన కలిగి ఉండాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 14 ;  చిన్నతనంనుంచే  మూఢనమ్మకాలపై  అవగాహన కలిగి ఉండి సమాజంలో మెలిగితే బంగారు భవిష్యత్తు నిర్మించుకోవచ్చని ప్రముఖ ఇంద్రజాలికుడు మంతెన రాజశేఖర్ అన్నారు.  గురువారం రెబ్బెన మండలం  నక్కల గూడ  గ్రామంలోని  ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు చిన్న చిన్న లాజిక్స్ ని మ్యాజిక్ ని నమ్మి వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని మోసపోతున్నారన్నారు.   దేవుడు, దయ్యం రెండు మానవ  కల్పితాలేనని అన్నారు.  దేవుడు  పేరుతొ  మోసం చేసే వాళ్ళను , దయ్యం అని చెప్పి భయపెట్టేవాళ్లను    నమ్మ రాదన్నారు, కొంతమంది స్వార్థపరులు ప్రజల సొమ్మును కాజేసి వారి  ఆస్తిపాస్తులు పెంచుకుంటున్నారని అన్నారు.  విద్యార్థులు మూఢనమ్మకాలను నమ్మకుండా వారి భవిష్యత్తును మరింత అందంగా  ఉజ్వలంగా తయారు చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ గ్రామస్తులు  మరియు విద్యార్థులు పాల్గొన్నారు

No comments:

Post a Comment