
కొమరంభీం ఆసిఫాబాద్ (రేబ్బెన)
ఫిబ్రవరి 3 ; రెబ్బెన మండలంలో తెరాస పార్టీ తరపున సర్పంచ్ లుగా గెలిచిన వారికి ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ల ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభకు విచ్చేసిన ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్, ఎం ఎల్ ఏ కోవలక్ష్మిల కు రెబ్బెన మరియు నంబాలలో ఘన స్వగతం లభించింది. రెబ్బెనలోని పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా అభినందన సభకు తోడ్కొని వెళ్లారు. మొదటగా పదవి భాద్యతలు స్వీకరించిన మండల సర్పంచ్ లను శాలువాలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో రెబ్బెన మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తెరాస పార్టీ అధికారంలోకి చ్చిన తర్వాత 85 శాతం గ్రామాలకు అంతర్గత రోడ్ ల నిర్మాణం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో
.
అభివృద్ధి
సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతు బందు, కళ్యాణ లక్ష్మీ,
షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ, వృద్ధులకు వికలాంగులకు, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచి ఇవ్వడం జరుగుతోందని అన్నారు. గత శాసనసభ ఎన్నికల మండలంలోని తెరాస పార్టీలోని కొంతమంది వెన్నుపోటుదారుల వలన ఎం ఎల్ ఏ కోవలక్ష్మి ఓడిపోయారని , వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, అన్నారు. కొద్దీకాలంలో ఇంచార్జి మంత్రిని నియమించిన తర్వాత మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో తెరాస అభ్యర్థులను గెలిపించినందుకు మండల ప్రజలకు కృతజఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఎంపిపి సంజీవకుమార్, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి, నంబాల సర్పంచ్ చెన్న సోమశేఖర్, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాస్, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, తెరాస మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,
మాజీ
సర్పంచ్ పెసర వెంకటమ్మ, రెబ్బెన మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, సుదర్శన్ గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య, మాజీ జడ్పీటీసీ కె చెంద్రయ్య,
పల్లె రాజేశ్వర్, మాణిక్య రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment