Saturday, 23 February 2019

నిబంధనల ప్రకారం పదోన్నతులు వేతన స్థిరీకరణ చేపట్టాలి

 కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 23 ; ఉమ్మడి సీనియారిటీ మరియు ప్రస్తుత నిబంధనల ప్రకారం పదోన్నతులు , వేతన స్థిరీకరణ చేపట్టాలని స్పెషల్ గ్రేడ్ టీచర్స్ ఢిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో జరిగిన సమావేశంలో ఎస్  జి టి   సమావేశంలో  ఉపాధ్యాయులు రాజకమలాకర్ రెడ్డి, కల్వల శంకర్ ,తదితరులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వేతన స్థిరీకరణ చేపడితే  తదనంతర పర్యవసానాల కు  జిల్లా విద్యాశాఖాధికారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించ వలసి ఉంటుందని అన్నారు. ఈ  సమావేశంలో లోకేష్, రవికుమార్, సోమశేఖర్, శ్రీను, నాగరాజు, మనోహర్, శ్రీనివాస్, జనార్దన్, శ్రీధర్, అశోక్, వినోద్, సంతోష్ లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment