కొమరంభీం ఆసిఫాబాద్ (రెబ్బన) ఫిబ్రవరి 21 సమస్యలను పరిష్కరించే వారినే శాసన మండలి ఎన్నికలలో ఉపాధ్యాయ ప్రతినిధిగా గెలిపించాలని .ఎస్టీయూ జిల్లా అధ్యక్షలు తాటి రవీందర్ అన్నారు. గురువారం రెబ్బెన మండలంలోని వివిధ పాఠశాలలలో ఎస్టీయూ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానంగా ఉఫాద్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సి పి ఎస్ అని .దానిని అంతం చేసే వరకు శాసన మండలిలో పోరాడుతామని, శాసన మండలిలో ప్రశ్నిచే వారు ఉన్నప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కరించబడుతాయని, ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఎస్టీయూ ముందుంటుందని, గతంలో ధర్మగ్రహాసభ,పొరుదీక్ష,మహాధర్నా,లాంటి కార్యక్రమాలను ప్రభుత్వ ఒత్తిడిలకు లొంగకుండా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ దిశగా ఉపాధ్యాయులు ఆలోచించి ఎస్ టి యు అభ్యర్థి ని గెలిపించ వల్సిందిగా కో రారు. ఈప్రచారంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క మానిక్ రావు,రెబ్బెన మండలాధ్యక్షులు చునార్కర్ తుకారామ్ రెబ్బెన మండల .ఎస్టీయూ కార్యదర్శి వసీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment