Monday, 9 December 2019

చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

రెబ్బెన : చలో ఢిల్లీ మాదిగ లొల్లి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘ రాష్ట్ర కార్యదర్శి శనిగారపు మల్లేష్ అన్నారు. సోమవారం మండలంలోని  అతిథి గృహ ఆవరణలో సంబంధిత కర పత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ తో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో చలో ఢిల్లీ మాదిగల లొల్లి జంతర్మంతర్ వద్ద జరిగే  కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధికార ప్రతినిధి ఇప్ప భీమయ్య మాదిగ జిల్లా కో ఆర్డర్ బొమ్మన శ్రీనివాస్ మాదిగ మన లైన్ చార్జ్ ఆత్మకూరి సతీష్మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment