రెబ్బన ; దేశవ్యాప్త సమ్మె కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. రెబ్బన మండలం లోని ఆర్.& బి గెస్ట్ హౌస్ లో ఏఐటీయూసీ మండల కమిటీ సమావేశని మండల అధ్యక్షుడు ఎం.శేషశయన రావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ 2020 జనవరి 8వ తేదీన జరిగే ,కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కార్పొరేట్లకు, యాజమాన్యాలకు అనుకూలంగా తయారు చేసిందని అన్నారు, దీనివలన కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు అలాగే కనీస వేతనం 21 వెయ్యి రూపాయలు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని,గ్రామ పంచాయతీ కార్మికులకు 8500 వేతనాలు ఇవ్వాలని డిమండ్ చేశారు,కార్మిక చట్టాల సవరణ ఆపాలని, స్కీమ్ వర్కర్ల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని డిమాండ్ చేశారు.అందరికి ఉపాధి కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 200రోజులు పెంచాలని,నిధులు పెంచి వేతనాలు ఇవ్వాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ధరలను, దేశంలో పని చేస్తున్న అసంఘటిత కార్మికుల అందరికీ సమగ్ర సంక్షేమ చట్టం వర్తింపజేయాలని అలాగే కనీస పెన్షన్ పది వేల రూపాయల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాడి గణేష్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు ఎం.శేషశయన రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,మండల కార్యదర్శి దుర్గం వెంకటేష్,ఉపాధ్యక్షుడు ప్రకాష్,సహాయ కార్యదర్శి అనుముల రమేష్,ప్రచార కార్యదర్శి శంకర్,కోశాధికారి ఆర్.దేవాజీ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 11 December 2019
Monday, 9 December 2019
అంత్యోదయ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి
రెబ్బెన ; రెబ్బెన మండలంలోని అంత్యోదయ కార్డులు లేని వికలాంగులు కార్డు కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు కోవాలని తహశీల్దార్ రియాజ్ అలీ తెలిపారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న వికలాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికలాంగ ద్రువీకరణ పత్రం తెల్లరేషన్ కార్డు జిరాక్స్ పత్రాలతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తును అందజేయాలన్నారు.
కోమరవేల్లి లొ మెడికల్ క్యాంప్
రెబ్బెన : మండలంలోని కోమరవేల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ మామిడి తిరుమల్ అద్వర్యం లో సోమవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మామిడి తిరుమల్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యంతో బాధపడటం చూసి మెడికల్ క్యాంప్ పెట్టాలలని జడ్పీటీసీ వేముర్ల సంతోష్ ని కోరగా స్పందించిన జడ్పీటిసి డాక్టర్ల డాక్టర్ రాకేష్ బృందంతో ఏర్పాటు చేశారని అన్నారు. మలేరియా, టఫైడ్ చికెన్ గుణ్య గుర్తించి మందులు పంపిణీ చేశారని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో hs ప్రవీణ్ కుమార్ గారు మెడికల్ సిబ్బంది మరియు 104 సిబ్బంది మరియు ఆశ వర్కర్ సునీత మరియు వర్డ్ సభ్యులు పాల్గొన్నారు
సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
రెబ్బెన : మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రదాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి,గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపీటీసీ సభ్యులు పెసరి మధునయ్య,కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి దుర్గం దేవాజీ,నాయకుడు పస్తం పొశం,యూత్ కాంగ్రెస్ నాయకులు మసాడి జగన్ ,మహిళ నాయకురాలు పద్మ తదితరులు పాల్గోన్నారు.
30 రోజుల ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి
రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయని రెబ్బెన మండల ఎంపీపీ సౌందర్య ఆనంద్ అన్నారు. సోమవారం మండలంలోని తుంగెడ లో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 రోజుల ప్రణాళిక లో భాగంగా పల్లెలు పరిశుభ్రంగా ఉన్నాయిాని, స్మశానవాటిక మరియు డంపింగ్ యార్డ్ త్వరగా పూర్తి చేయాలని,మరియు పలు అభివృద్ధి పనులకు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య,sec వంశీకృష్ణ, వార్డ్ నంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు,
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రెబ్బెన : చలో ఢిల్లీ మాదిగ లొల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ సంఘ రాష్ట్ర కార్యదర్శి శనిగారపు మల్లేష్ అన్నారు. సోమవారం మండలంలోని అతిథి గృహ ఆవరణలో సంబంధిత కర పత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ తో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో చలో ఢిల్లీ మాదిగల లొల్లి జంతర్మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధికార ప్రతినిధి ఇప్ప భీమయ్య మాదిగ జిల్లా కో ఆర్డర్ బొమ్మన శ్రీనివాస్ మాదిగ మన లైన్ చార్జ్ ఆత్మకూరి సతీష్మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గోలేటి సర్పంచ్ పొటు సుమలత శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ 15000 చెక్ ను నంచర్ల ఉమ కు అందజేసరు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ముందుంటుందని పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు చేయూత నుంచి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మేర బాబురావు, పోటు శ్రీధర్ రెడ్డి, కరొబార్ సుధాకర్ పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)