కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; సంచార జాతుల కులాల వారి నైపుణ్య అభివృద్ధి కోసం పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన వారి వివరాలు సేకరించాలని కొమురంభీం జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవం పాటిల్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జికూటివ్ ఆదేశానుసారం జిల్లాలో సంచారజాతుల అభ్యర్థుల వివరాలు సేకరించి ఈ నెల లోపు ఆసిఫాబాద్ లోని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు ఇందుకు సంబంధించిన నమూనా పత్రంలో పొందుపరిచిన అంశాల ప్రకారం వివరాలను పూర్తిచేసి అందించాలన్నారు.
No comments:
Post a Comment