కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 9 ; ఓటర్ జాబితాలో పేరు లేనివారు, కొత్తగా అర్హులైనవారు, సవరణలు చేసుకొనే వారు తప్పకుండ పేరు నమోదు చేసుకోవాలని రెబ్బెన తహశీల్ధార్ సాయన్న తెలిపారు. ఆదివారం ఫిబ్రవరి 11 న ప్రత్యేక జాతీయ ఓటరు నమోదు దినోత్సవం సందర్బంగా పేరు నమోదు చేసుకొనే వారు ఆధార్ కార్డు , 2 ఫొటోలుతీసుకోని రావాలని తెలిపారు. 14 వ తేదీ తో ఈ ప్రక్రియ ముగుస్తుందని అన్నారు. ఆదివారం నాడు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 వరకు అందుబాటులో అంటారన్నారు. నమోదు, మార్పులు, సవరణలకు సంబంధించి . 6 7 8 ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు . ఈ అవకాశాన్ని18 సంవత్సరాలు నిండిన అందరు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment