రెబ్బెన : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపద్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రెబ్బెన ఎస్ ఐ భవానీ సేన్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. , వ్యాక్సిన్ మొదటిసారి మరియు రెండవ సారి తప్పనిసరిగా తీసుకొని మాస్కో ధరించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని లేనియెడల వెయ్యి రూపాయలు జరిమానా విధి ఇస్తామన్నారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వీయ రక్షణ, కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ ప్రజలు మాస్క్ ధరించి సహరించాలనీ కోరారు.
No comments:
Post a Comment