Sunday, 5 December 2021

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు


కొమురం భీం ఆసిఫాబాద్ :  జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్  చంద్రశేఖర్ రెడ్డి  ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమెరి మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు కేరమేరి మార్కెట్ లో గల సాధ్ చావ్ సన్నాఫ్ సయ్యద్ చావ్, కి సంబదించిన కిరణ షాప్   లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు షాప్ లో తనిఖీలు  నిర్వహించగా షాప్ లో సుమారు 8000/- రూపాయల గుట్కా పాకెట్స్  పట్టుకొని కెరమెరి  పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి గుట్కా పాకెట్స్ ను సీజ్ చేసి కెరమెరి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.

NHM మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్



ఆసిఫాబాద్  :  ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఎన్. హెచ్.ఎం మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ కొమురంభీం జిల్లా అధ్యక్షుడుగా బోగే ఉపేందర్ ను ఎన్నుకొన్నట్లు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు,ఆసిఫాబాద్ లో ఈరోజు జరిగిన  జిల్లా ప్రతినిధుల సభలో ఎన్నుకొన్నారు,ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఎన్. హెచ్.ఎం స్కీఎమ్ లో పనిచేస్తున్న  ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారుఅన్నారు. 

Saturday, 4 December 2021

దేశి దారు పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు


కొమురం భీం ఆసీఫాబాద్ : జిల్లా ఇంచార్జ్ రామగుండం సీపీ ఎస్ చంద్రశెరఖర్ రెడ్డి ఐపీఎస్ , ఎస్పీ వై. వీ.ఎస్ సుధీంద్ర ఆదేశాల మేరకు, తమకు అందిన పక్కా సమాచారం మేరకు  ఆసిఫాబాద్ మండల కేంద్రం లో ప్రభుత్వ నిషేధిత దేశి దారు అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు ఆసిఫాబాద్ లో నీ రవి చంద్ర కాలనీ లో కామ్రేడ్ ధనరాజ్ S/o బాబూరావు ఇంట్లో తనిఖీలు నిర్వించగ వారి ఇంట్లో విక్రయించడానకి సిద్దంగా ఉన్న మహరాష్ట్ర నుండి ప్రభుత్వ నిషేధిత దేశి దారు  90 ml బాటిల్స్ 44 ఉన్నాయి వాటి యొక్క సుమారు విలువ రూ 2640/- గా ఉంటుంది. వాటిని పట్టుకుని  ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఒక్కరి పై కేసు నమోదు చేసి దేశి దారు బొట్టెల్స్ ను సీజ్ చేసి   ఆసిఫాబాద్  పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐ సాగర్, సత్తార్ కానిస్టేబుల్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, సంజయ్, సంపత్ పాల్గొన్నారు.

పరిపాలనలో విఫలమైన ప్రభుత్వాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు

ప్రారంభమైన జిల్లా రెండో మహాసభలు


ఆసిఫాబాద్  :  పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మీడియం బాబురావు అన్నారు.  జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్ లో శనివారం ప్రారంభమైన జిల్లా ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి 

అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడు సంవత్సరాల పాలనలో ప్రజలను పీల్చిపిప్పి చేశాయని అన్నారు. దేశంలో మత వాదాన్ని రెచ్చగొడుతూ బిజెపి పబ్బం గడుపుకుంటున్నదని అన్నారు. ప్రతి పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. రైతు చట్టాలు, కార్మిక చట్టాలు, విద్యుత్ సంస్కరణలు లాంటి వాటి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు 8 గంటల పని దినాలు తీసుకువస్తే మోడీ ప్రభుత్వం చట్టాలను సవరించి 12 గంటలకు పెంచిందన్నారు. గడిచిన ఏడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 1256 చట్టాలు సవరించినదన్నారు. పార్లమెంటులో చర్చించి చట్టాలు తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు చేస్తున్నారని ఇది మంచిదికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని దీనికి నిదర్శనమే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పన్ను 31 శాతం నుండి 22 కు తగ్గించారన్నారు. దేశంలో పుట్టిన వ్యక్తులకు వారసత్వం ఇవ్వాల్సిన ప్రభుత్వాలు మత విశ్వాసాల ఆధారంగా ఓటు హక్కు ఇచ్చే విధంగా సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. వామపక్ష పార్టీలు ఇతర దేశాలకు మద్దతు పలుకుతానని ఆరోపించడం సరికాదని స్వాతంత్రోద్యమ సమయంలో పూర్తి స్వాతంత్ర్యం కావాలని బ్రిటిష్ వారితో పోరాటం చేసిన పార్టీ తమదేనని గుర్తు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కరోనాపై నెట్టుతుందని ప్రజలకు పోషకాహారం అందించడం, టీకా వేయడంలో విఫలమైందన్నారు. మొదటి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో మరణాలు నమోదు కాలేదని దీనికి కారణమే ఆ రాష్ట్రం ప్రజలకు పోషకాహారంతో కూడిన కిడ్స్ అందించడమే కాకుండా, ప్రతి ఒక్కరికి రెండు డోసులు టీకా వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంభిస్తోందని మిగులు రాష్ట్రాన్ని నేడు 41 కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయిందని నేడు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలను అణిచివేసే దిశగా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రెగ్యులర్ గా జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదని తెలిపారు. రాష్ట్రంలో పోడు సాగుదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ కేవలం ఒక తంతు లాగ నడుస్తుందని ఇలా కాకుండా ప్రతి సాగుదారునికి పట్టాలు అందించాలన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి జిల్లా నాయకత్వం పనిచేయాలన్నారు. పార్లమెంటరీ పోరాటాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా పోరాటాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు. పోడు భూముల పై తీర్మానం ప్రవేశ పెడుతూ జిల్లా సభ్యుడు కోట శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన సంక్షేమ శాఖ పోడు భూములకు సంబంధించి ప్రముఖ పాత్ర పోషించాలని, కానీ అటవీ అధికారులు వారిపై పెత్తనం చెలాయిస్తున్నారన్నారు ప్రతి పోడుసాగుదారునికి పట్టాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర నాయకుడు జిల్లా ఇన్చార్జి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి అట్టడుగు స్థాయిలో ఉందని అన్నారు. ఎక్కువ మంది గిరిజనులు నివాసం ఉంటున్న జిల్లాలు విద్య వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఆ దిశగా కృషి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వామపక్ష పార్టీగా తమపై ఉందన్నారు. జిల్లాలో నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి కార్మికులు కర్షకులు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకుడు పస్తం ఆనంద్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సోమయ్య, మధు, ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ కుశాన రాజన్న, జిల్లా కమిటి సభ్యులు అల్లూరి లోకేశ్, కోట శ్రీనివాస్ దుర్గం దినకర్, ముంజం శ్రీనివాస్, గొడిసెల కార్తీక్, నైతం రాజు చాపిలె సాయికృష్ణ భీమేష్ ఉమ్మడి జిల్లా నాయకులు ఎన్.వి. రమణ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

 రెబ్బెన  :  వన్యప్రాణుల సంరక్షణ పై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని సంరక్షించే  విధంగా సహకరించాలని రెబ్బెన అటవి క్షేత్ర అధికారి పూర్ణిమ అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల అటవీ శాఖ కార్యాలయంలో  మండల పోలీస్,రెవెన్యూ,విద్యుత్, మండల పరిషత్తు ఉన్నత అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ పూర్ణిమ మాట్లాడుతూ  వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చడం వలన సామాన్య ప్రజలు ప్రాణాలు కొల్పతున్నారని, అలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు భాద్యతయుతంగా వ్యవహరించాలని కోరారు. అటవీ సంపద అయిన వన్యప్రాణులు, చెట్లు,ఇసుక తరిగి పోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.  అటవీ సంపదను దోచుకున్నట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎస్సై భవాని సేన్, పి ఎస్ ఐ సరిత,  ఏ పీ ఓ కల్పన,విద్యుత్తు అధికారులు పాల్గొన్నారు.

మాస్క్ తప్పనిసరి లేకపోతే జరిమానా : ఎస్ఐ భవానీ సేన్

  రెబ్బెన : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ తీవ్ర రూపం దాల్చుతున్న నేపద్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని   రెబ్బెన ఎస్ ఐ భవానీ సేన్ అన్నారు. శనివారం పోలీస్ స్టేషన్లో  మాట్లాడారు. , వ్యాక్సిన్  మొదటిసారి మరియు రెండవ సారి తప్పనిసరిగా తీసుకొని మాస్కో ధరించాలని సూచించారు.  ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో,   మాస్కులు ఖచ్చితంగా ధరించాలని లేనియెడల    వెయ్యి  రూపాయలు జరిమానా విధి ఇస్తామన్నారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి  గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వీయ రక్షణ,  కోవిడ్19  నిబంధనలు  పాటిస్తూ   ప్రజలు  మాస్క్ ధరించి సహరించాలనీ కోరారు.

Tuesday, 22 June 2021

నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు : రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్



 రెబ్బెన : నకిలీ విత్తనాలు క్రయవిక్రయాలు జరిపిన వారిపై  పీడీ యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు ఉంటాయి అని రెబ్బెన ఎస్ ఐ భవాని సేన్ అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ నిభంధనల ప్రకారం,  కొమురం భీం జిల్లా ఆసిఫాబాదు డి‌జి‌పి   ఎస్‌పి Y.V.S సుధీంద్ర ఆదేశాల మేరకు  పోలీస్ సిబ్బంది ,వ్యవసాయ అధికారి సిబ్బంది  సహాయముతో మద్వైగుడా గ్రామంలో తనిఖీ  చేయగాఅలగం శ్రీనివాస్ దగ్గర ఒక కింట 50 కిలోల గ్రాసిల్  నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 2లక్షల 40 వేలు ఉంటుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ పక్కా సమాచారంతో నకిలీ విత్తనాల సరఫరా విక్రయాలు జరిపే వారిపై దాడులు నిర్వహిస్తామని తెలిపారు.  గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.  ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం  అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జుమీడి పరిమళ ,పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.