రెబ్బెన ; విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉన్నత శ్రేణులకు ఎదగాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం రెబ్బెన మండలంలోని రెబ్బెన ఆర్ట్ & సైన్స్ కళాశాలలోబుధవారం ఏర్పాటు చేసిన ఎనిమిదవ వార్సకోశావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీ కళాశాలకు వచ్చాక ఒక గోల్ ఏర్పాటు చేసుకుని ఆసక్తి గల రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలు పట్టకుండా సెల్ఫోన్లతో కాలయాపన చేయకుండా విద్యపై ఆసక్తి చూపించి పై రంగాల్లో రాణించాలన్నారు విద్యార్థులు కళాశాలలో పాఠాలు చెప్పేటప్పుడు ముఖ్యమైన సందేశాలను నోటు పుస్తకంపై రాసుకుని చదువుకోవాలన్నారు. మహనీయుల జీవిత చరిత్ర పుస్తకాలతో జ్ఞానం పెంపొందుతుందని ఆసక్తిగల రంగాల్లో విద్యార్థులు ముందుకు వెళ్లి మంచి స్థానాల్లో ఉండాలన్నారు ప్రతి రోజూ వచ్చే వార్తా పత్రికలోని ఎడిటోరియల్ కాలమ్స్ చదవాలని సూచించారు అలాగే సమాజం మనకు చాలా నేర్పుతుంది దాని ముందు మంచిని స్వీకరించి కాలానికి అనుగుణంగా మారుతూ ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ అహల్యాదేవి, ఎంపీపీ సంజీవ్ కుమార్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, కళాశాల కరస్పా టీ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మాని, విమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రెడ్డి, ఎస్డీ రమేష్, డైరెక్టర్లు దేవేందర్రావు శ్రీధర్రావు మరియు కళాశాల సిబ్బంది వాచర్లు పాల్గొన్నారు
No comments:
Post a Comment