Friday, 20 April 2018

ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకంలో వంట గ్యాస్ పంపిణి

  
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; ప్రధానమంత్రి ఉజ్వల్ అభియాన్ పథకం ద్వారా రెబ్బెన మండలం తుంగ డ  గ్రామంలో శుక్రవారం  పలువురు మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి బాయి  , హెచ్ పి  గ్యాస్ డీలర్లు ప్రకాష్ అగర్వాల్, రాకేష్ అగర్వాల్ లు వంటగ్యాస్ పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద  లబ్ది దారులకు సబ్సిడీ పైన గ్యాస్  కనెక్షన్ లను అందచేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ వాడటం వళ్ళ వంట చెరుకు కోసం  చెట్లను నరికివేత కాస్తైనా తగ్గుముఖం పడుతుంది అని అన్నారు. పాతపద్ధతిలో కాకుండా వంట గ్యాస్ పైననే వంట చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు భగవాన్ , పర్వతాలు, వార్డ్ మెంబెర్ లు రుక్కుమ్ బాయి , పార్వతి ,అంగన్వాడీ కార్యకర్త అమృత, ఫీల్డ్ అసిస్టెంట్ రహీమ్ పాషా, వి ఆర్ ఓ లు వెంకటేష్, నాందేవ్ గ్రామస్తులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment