Thursday, 26 April 2018

టాస్క్ ఫోర్స్ తనిఖీలలో సుమారు 5,00,000/- విలువ చేసే మద్యం స్వాధీనం


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 26 ;  కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని చింతాలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం సరిహద్దులో ఉన్న గూడెం గ్రామం నుండి మహారాష్ర్ట లో మద్య నిషేధం అమలవుతున్న గడ్చిరోలి జిల్లాకీ నిత్యం గుట్టుచప్పుడు కాకుండా  అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తుల వివరాలు సేకరించిన టాస్క్ ఫోర్స్ టీం సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు  గూడెం గ్రామంలో తనిఖీలు నిర్వహించగా కస్తూరి అశోక్ రెడ్డి, కస్తూరి రాఘవ రెడ్డి, బోయేరే రవి, జైస్వాల్ సంతోష్ మరియు జైస్వాల్ జవహర్ లాల్ ల వద్ద  సుమారు 5,00,000/- విలువ గల మద్యం మరియు 10 ఫీట్ల టేకు కలప నిల్వలు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం చింతలమానేపల్లి  పి.ఎస్. పోలీస్ వారికి  అప్పగించడం జరిగింది.

No comments:

Post a Comment