Thursday, 18 January 2018

సీఆర్పీ రాష్ట్ర సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరన


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 18 ; రెబ్బెన: సీఆర్పీ రాష్ట్ర సదస్సుకు సంబందించిన గోడప్రతులను  గురువారం రెబ్బెన  మండలం  ఎం ఈ ఓ కార్యాలయం ఎదుట జరిగిన ఒక కార్యక్రమంలో సీఆర్పీ కుమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి యం రాజేష్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ  విద్యారంగం అభివృద్ధిలో సి ఆర్ పి  ల పాత్ర ఎంతో  ఉన్నదని  , తమకు ఉద్యోగ భద్రతా కల్పించాలని, సమన పనికి సమన వేతనం ఇవ్వాలని, తమ వేతనాలను కనీసం 28940 గ నిర్ణయించాలని,పి  ఎఫ్ సౌకర్యం కల్పించాలని, 2014 నుండి నష్టపోయిన జీతాలను   చెల్లించాలని తదితర డిమాండ్లతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.   ఈ నెల  21 న వరంగల్ లో  నిర్వహిస్తున్న.విద్యా రంగం-సీఆర్పీల  పాత్ర  రాష్ట్ర సదస్సును అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్య క్రమంలో  విద్యాధికారి యం వెంకటేశ్వర స్వామి, సీఆర్పీ యం దేవెందర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment