Tuesday, 17 May 2022

వరి ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి




రెబ్బెన: రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ  జమ్మిడి సౌందర్య ఆనంద్, జడ్పిటిసి వేముర్ల సంతోష్లు అన్నారు.   మంగళవారం రెబ్బెన మండలం  సహకార సొసైటీ లో పిఎసిఎస్, చైర్మన్ కర్నాతం సంజీవ్ కుమార్ , వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తగిన గిట్టుబాటు కి కొనుగోలు కేంద్రాలలో విక్రయించి నచ్చని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మొదటి రకం 1960 రెండో రకం1940 క్వింటా కి తీసుకుంటారని అన్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని 17 శాతం  ఉంటే గిట్టుబాటు ధర ఉంటుందని రైతులకు కు అవగాహన కల్పించారు.  ఆధార్ కార్డు జిరాక్స్ పట్టా పాస్ బుక్ జిరాక్స్ బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ లు  జత చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన ఎంపిటిసి,మధునయ్య సర్పంచుల సంగం మండల అధ్యక్షుడు చెన్న సోమశేకర్, గంగాపూర్ ఆలయ చైర్మన్ ఓల్వోజి వెంకటేశం చారి, డైరెక్టర్లు కడ్తల మల్లయ్య, అజయ్ జెస్వాల్,టీఆర్ ఎస్ నాయకులు మోడెం సుదర్శన్ గౌడ్, మహిళ నాయకురాలు కుందారపు శంకరమ్మ,  రాపాల శ్రీనివాస్,సి ఈ ఓ సంతోష్, ఏ ఈ ఓ లు పరిమళ, శివకుమార్ లు పాల్గొన్నారు.

Wednesday, 4 May 2022

జై గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్


రెబ్బెన : జై గౌడ సంక్షేమ సంఘం  కొమరం భీమ్  జిల్లా అధ్యక్షులు గా ఆకుల సురేష్ గౌడ్ ని ఎన్నుకున్నట్లు జై గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ బుధవారం   తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంక్షేమ సంఘం  పురోగతి కోసం ఎంతో కృషి చేస్తానన్నారు. తన నియామకానికి కృషిచేసిన జై గౌడ  సంక్షేమ సంఘం వ్యవస్థాపకు అధ్యక్షులు బుర మన్సూర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్  గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Saturday, 8 January 2022

పేదలకు సేవ చేయడం ఎంతో గర్వకారణం

 రెబ్బెన :      పేదలకు సెవ చేయడం ఎంతో ఉన్నతమైనదాని, సర్పంచి అహల్యాదేవి, రెబ్బెన సి ఐ సతీష్ కుమార్, ఎస్సై పి భవాని సేన్ లు అన్నారు.  రెబ్బెన లో సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో పేద వారికి దుస్తులను , చీరలను శనివారం పంపిణీ  చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కూడా డా ఎన్నో రకాల వివిధ సేవా కార్యక్రమాలను సంస్థ ద్వారా చేయడం జరిగింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛత  పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా కరోనా  సమయంలో  సన్మానించడం  జరిగిందని,  అదేవిధంగా సంజీవని స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో  అధ్యక్షుడు దీకొండ సంజీవ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, మగవారికి  డ్రెస్సులు పంపిణీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భవిషతులో  ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని,  దానికోసం మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం పి టి సి సభ్యులు పెసర మద్దయ్య,సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ దీ కొండ సాయి తేజ,  సంజీవనిస్వచ్చంద అధ్యక్షుడు సంజీవ్ కుమార్,  సంజీవని స్వచ్ఛంద   రాజశేఖర్ ,తిరుపతి,  మహేందర్,  విజయ కుమారి శీభా , బొడ్డుప్రసాద్ లతోపాటు విద్యార్థులు ఉన్నారూ.

Sunday, 2 January 2022

అధికారుల ప్రోత్సహముతో అభివృద్ధి దిశలో--పి ఓ శ్రీనివాస్

  రెబ్బెన :   సింగరేణిలో రాత్రిమ్బావాళ్ళు పని చేస్తూ అభివృద్ధి దిశలో వెళ్తున్నామంటే దానికి కారణం జి ఎం సంజీవ రెడ్డి తో పాటు పై అధికారుల ప్రోత్సహమేనని ఖైరిగుడా ప్రాజెక్టు అధికారి ఎం శ్రీనివాస్ అన్నారు. ఆదివారం  ఆయన  మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర గోదావరి పరివాహక ప్రాంతములో ప్రజానీకానికి ఉద్యోగ కల్ప తల్లిగా మారి ఎందరికో సింగరేణి తెలంగాణ తల్లిగా వెలసిల్లింది అని తెలిపారు . కార్మికులు , సుపెరువైజర్లు అధికారులు కలిసి కట్టుగా పనిచేస్తే కంపెనీ యాజమాన్యం పెట్టిన టార్గెట్ ను అధిగమించే విధంగా  అందరూ కృషి చేయాలని  అన్నారు. అదేవిధంగా  జీఎం ఆధ్వర్యంలో రక్షణ చర్యలు, కార్మిక సంక్షేమంపై దృష్టి సారిస్తూ , ఉత్పత్తిని సాధిస్తున్నామని అన్నారు. ఖైరిగుడా ఓపెన్ కాస్టులో ని కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.