రెబ్బెన : పేదలకు సెవ చేయడం ఎంతో ఉన్నతమైనదాని, సర్పంచి అహల్యాదేవి, రెబ్బెన సి ఐ సతీష్ కుమార్, ఎస్సై పి భవాని సేన్ లు అన్నారు. రెబ్బెన లో సంజీవని స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థ ఆధ్వర్యంలో పేద వారికి దుస్తులను , చీరలను శనివారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కూడా డా ఎన్నో రకాల వివిధ సేవా కార్యక్రమాలను సంస్థ ద్వారా చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛత పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా కరోనా సమయంలో సన్మానించడం జరిగిందని, అదేవిధంగా సంజీవని స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు దీకొండ సంజీవ్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, మగవారికి డ్రెస్సులు పంపిణీ చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భవిషతులో ఉన్నతమైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని, దానికోసం మా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎం పి టి సి సభ్యులు పెసర మద్దయ్య,సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ దీ కొండ సాయి తేజ, సంజీవనిస్వచ్చంద అధ్యక్షుడు సంజీవ్ కుమార్, సంజీవని స్వచ్ఛంద రాజశేఖర్ ,తిరుపతి, మహేందర్, విజయ కుమారి శీభా , బొడ్డుప్రసాద్ లతోపాటు విద్యార్థులు ఉన్నారూ.
No comments:
Post a Comment