కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 16 : ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి అన్నారు. శుక్రవారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాదారు. ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, నిషేదిత గుట్కాలు, గుడుంబా విక్రయించరాదని, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు. వర్షాల కారణంగా రోడ్ ల పై పడిన గుం తలను పోలీసులు మీకోసం భాగంగా పూడ్చడం జరిగిందన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు అమర్చడం జరిగిందని కావున వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రజలు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment