నంబాల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ వితరణ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 19 ; రెబ్బెన మండలం నంబాలగ్రామంలోని ప్రభుత్వ సెకండరీ పాఠశాలకు విద్యార్థుల ఉపయోగార్థం వాటర్ ఫిల్టర్ ను నంబాల గ్రామా వాస్తవ్యులైన హిమాకర్ వారి తల్లిదండ్రులైన రత్నం పోశయ్య మల్లు బాయి ల జ్ఞాపకార్ధం వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ కె ప్రసాద్ తెలిపారు..గతంలోకూడా విద్యార్థుల సౌకర్యార్ధం బెంచీలు,తదితర వస్తువులు అందిస్తూ విద్యావ్యాప్తికి తమవంతు కృషిచేస్తున్నారని తెలిపారు. పడవ తరగతి పరీక్షలలో ప్రధమస్థాయిలో ఉత్తీర్ణులైన ముగ్గురికి నగదు ప్రోత్సహకాలు ,మరియు పెదవిద్యార్థులకు పుస్తకాలూబ్యాగులు పంపిణి చేస్తున్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో పాఠశాలా కమిటీ అధ్యక్షులు దెబ్బతి సత్యనారాయణ , రత్నం సుబ్బారావు, మరియు పాఠశాలఅధ్యాపకులు ,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment