అంబెద్కర్ జయంతి ఉత్సవాల రెబ్బెనలో ఘనంగా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 25 ; (వుదయం ప్రతినిధి) ; అంబెద్కర్ జయంతి ఉత్సవాల సందర్బంగా రెబ్బెన మండల కేంద్రం లోని రోడ్డు భావన అతిధి గృహం లో అంబెద్కర్ సంఘ నాయకులూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. రెబ్బెన మండల కేంద్రం లోని రోడ్డు భావన అతిధి గృహం లో అంబెద్కర్ సంఘ నాయకులూ ఏర్పాటుచేసిన సభలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కోవలక్ష్మి హాజరై దళితులకు చేసిన సేవల గురించి మాట్లాడారు. ముందుగా భారీ ర్యాలీ నిర్వహించి గంగాపూర్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు అంబేద్కర్ వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు భారత రాజ్యాంగ కర్త డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని అన్నారు. రెబ్బెనలో ఈ కార్యక్రమంలో ఎంపిపి సంజీవ్ కుమార్,జడ్.పి.టి.సి. బాబూరావు,తహసిల్దార్ రమేష్ గౌడ్, ఆర్ టి ఓ శ్యామ్ నాయక్, సర్పంచ్ లు రవీందర్ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, వైస్ ఎంపీపీ రేణుక మాజీ సర్పంచ్ దుర్గం హనుమంతు కమిటీ దుర్గం శివాజీ మండల్ కో ఆప్షన్ సభ్యులు జాకిర్ హుస్సేన్ , నరేష్ ఎంపిటిసి వనజ, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మొండయ్య,హన్మంతు, ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, దుర్గం సోమయ్య, భరద్వజ్, దేవాజి, రాజేష్ తధీతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment