Tuesday, 14 March 2017

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 14 ;  ప్రతిభ పరీక్షలో గెలుపొందిన వారికీ ఎస్ ఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రెబ్బెన జెట్ పి హెచ్ ఎస్  లో బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిఐ మదన్ లాల్, ఎం ఈ ఓ వెంకటేస్వర స్వామిలు హాజరై మాట్లాడుతూ ప్రతిభ  పరీక్షలతోనే విద్ద్యార్థుల మేధా  శక్తిని  వెలికితీయవచ్చని అన్నారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేయడం ద్వారా విద్యార్థులు ఉత్సాహవంతులు అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత,దేవ్ లాల్,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థి నాయకుడు దుర్గం రాజ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment