Saturday, 18 July 2015

జీవో 14ను రద్ధు చేయాలి

రెబ్బెన : అంగన్‌వాడీ కార్యకర్తలు రెబ్బెన మండల తహసీల్ధార్‌ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నా చేశారు జీవోనెంబర్‌ -14ను రద్దు చేయాలని కనీస వేతనం రూ.15వేలకు పెంచాలని నినాదాలు చేసుకుంటూ తహసీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్‌, సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ మద్దతు పలికారు. ఈ కార్యకరమంలో రాజేశ్వరీ, భారతీ,  అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు బట్టల పంపిణి

  



రెబ్బెన : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మైనార్టీ బట్టల పంపిణి కార్యక్రమంలో శుక్రవారం నాడు రెబ్బెన మండలంలోని ముస్లీం సోదరులకు బట్టల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు, ఎమ్.పి.డి.ఓ. ఆలిం,తహసీలార్‌ రమేష్‌గౌడ్‌రెబ్బెన సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌కుమార్‌, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, మండల యూత్‌ అధ్యక్షులు వెంకటరాజ్యం, మసీద్‌ కమిటీ అధ్యక్షులు అజీజ్‌, మైనార్టీ నాయకులు అన్వర్‌, కోఆప్షన్‌ సభ్యులు జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

పదహేడవ రోజుకు చేరింది. పంచాయితి కార్మికులు సమ్మె



గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె  శుక్రవారానికి రెబ్బెన మండలంలో పదహేడవ రోజుకు  చేరింది. పంచాయితి కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని తహశిల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారి మీద  ధర్నా చేశారు, పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని  అన్నారు. ఈ ధర్నాలో మద్దతుగా  వామపక్ష   నాయకులు బైటాయించారు, టిడిపి మహిళా  జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ మాట్లాడుతూ    ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం పెంచాలని అన్నారు ప్రభుత్వం విఫలమైందని కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు   కార్యక్రమంలో టిడీపి మండల అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ ఎమ్మర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్,ఎమ్మర్పిఎస్ అధ్యక్షుడు బొంగు నర్సింగా రావు
సీపిఐ నాయకులు నర్సయ్య,సత్యనారాయణ,సీ.ఐ.టీ.యి. జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్, గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు 

Thursday, 16 July 2015

ఆర్‌ఐవోకు వినతిపత్రం


రెబ్బెన: రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వచ్చిన ఇంటర్‌ మీడియట్‌ పర్యవేక్షణ అధికారి ప్రభాకర్‌కు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుర్గం రవీందర్‌ మాట్లాడుతూ... ఖాలీగా ఉన్న అధ్యాపక అటెం డర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నిబంధనలు పాటించని ప్రైవేటు కళాశాలలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలోనాయకులు సాయి, రాజు, కార్తిక్‌ పాల్గొన్నారు. 

పంచాయితి కార్మికుల భిక్షాటన


గ్రామా పంచాయితీ ఉద్యోగుల నిరవధిక  సమ్మె  గురువారానికి రెబ్బెన మండలంలో పదహరోవ  రోజుకు  చేరినా ప్రభుత్వం స్పందించక పోవటంతో  గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికులు  నిరవధిక సమ్మెలో భాగంగా భిక్షాటన చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందింఛి తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వo ఇలా చేయడం సిగ్గుచేటు అని రత్నం విటల్  మాట్లాడుతూ  గ్రామ  పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగాల కనీసవేతనం  గ్రామ పంచాయితిలలోని ఖాళీ పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందినే నియమించాలని ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని అన్నారు సమ్మెకు ఎం,ఆర్,పీ,ఎస్ . నాయకులు మద్దతు పలికారు లింగంపల్లి ప్రభాకర్ మాదిగ,ఎం,ఆర్,పీ,ఎస్ ఎస్సి సెల్ సభ్యులు నర్సింగా రావు మాదిగ, రాజేష్ మాదిగ పలువురు నాయకులు, పంచాయితి సిబ్బంది పాల్గొన్నారు. 

పైపు లైను పనులను పర్యవేక్షించిన సర్పంచ్

 నీటి వసతి కొరకు పాత పైపులైను  చెడిపోయిన కారణంగా రెబ్బెన మండల గ్రామ పంచాయితిలోని ప్రదాన రహదారి ప్రక్కన  మోడెం రాజగౌడ్  ఇంటి నుండి రాపర్తి శేఖర్ ఇంటి వరకు నీటి వసతి కొరకు మొత్తం పైపు విస్తిర్ణం పొడవు 280 మీటర్లు బుధవారం నాడు రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పెసరు మధునయ్య పంచాయితి కార్యదర్శి రవీందర్ మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు

Wednesday, 15 July 2015

ఫర్టిలైజర్‌ షాపుల తనిఖీ




రె బ్బెన: రెబ్బెన మండలంలో బుధవారం తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారి మంజుల, ఫర్టిలైజర్లను తనిఖి చేశారు. అధిక ధరలకు విక్రయించవద్దని నకిలీ విత్తనాలు అమ్మకూడదని  ప్రభుత్వ నిర్ణిత ధరలకే విక్రయించాలని యాజమానులకు సూచించారు.

మొక్కలు నాటండి -పర్యావరణాన్ని కాపాడండి - ఎంపీపీ



రె బ్బెన : ప్రతి ఒక్కరు మొక్కలు నాటితే పర్యావరణాన్ని కాపాడవచ్చునని రెబ్బెన ఎంపీపీ కార్నాదం సంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో బుధవారం నాడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా ప్రయివేటు పాఠశాలలోమొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. నేటి మొక్కలు రేపటి వృక్షాలుగా మారి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలి ప్రాణవాయువుని ఇచ్చి మనలను కాపాడుతాయని అన్నారు. విద్యార్థులందరు ఒక్కొ మొక్కను నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్‌ వెంకటమ్మ, ఉప సర్పంచ్‌ శ్రీధర్‌ కుమార్‌, పాఠశాల కరస్పాండెంట్‌ సంజీవ్‌కుమార్‌, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు

15వ రోజుకు చేరిన గ్రామా పంచాయితి కార్మికుల సమ్మె



రెబ్బెన మండలంలోని తహసీల్ధార్‌ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారానికి 15వ రోజుకు చేరుకుంది. గ్రామ పంచాయతీ కార్మికులు చీపురులు పట్టుకుని ప్రభుత్వానికి పట్టిన దుమ్మును దులుపుతామని నిరసన తెలియజేశారు. ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్షులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మరియు మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్ మాట్లాడుతూ... కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కార్మికులను ఏ మాత్ర పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు  ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి. ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, , నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ 

 భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు

క్విజ్‌ పోటీలలో విద్యార్థికి బహుమతి ప్రదానం



రె బ్బెన: హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌ పోటీలలో రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్యాలయం, ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎం. సాయికిరణ్‌ ద్వితీయ బహుమతి సాదించినట్లు కరస్పాండెంట్‌, ప్రధానోపాద్యాయులు సంజీవ్‌కుమార్‌ తెలిపారు. బహుమతిని రెబ్బెన ఎంపీపీ స ంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు, రెబ్బెన సర్పంచ్‌ వెంకటమ్మలు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శ్రీధర్‌ కుమార్‌, పాఠశాల కరస్పాండెంట్‌ సంజీవ్‌కుమార్‌, తెదేపా మండల అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మదనయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 14 July 2015

పద్నలుగొవ రోజుకు చేరిన గ్రామా పంచాయితి ఉద్యొగుల సమ్మె



గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమ్మె  మంగళవారానికి పద్నలుగొవ  రోజుకు  చేరింది.  గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికుల నిరవధిక దీక్షలో పచ్చి కూరగాయలు తింటూ  నిరశన తెలియజేసారు  గ్రామ  పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగ,కార్మికులను పర్మినెంటు చేయాలని కార్మికుల కనీసవేతనం  ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని పద్నలుగొవ రోజు అయిన పట్టించుకోవడం లేదని  అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయితి జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజి, మండల అధ్యక్షుడు జి.ప్రకాష్, డివిజన్ కమిటి సభ్యులు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విటల్, నాయకులు అన్నాజీ .లక్ష్మి రాజమ్మ సత్యనారాయణ భాస్కర్ గ్రామా పంచాయితి కార్మిక సిబ్బంది పాల్గొన్నారు

అధికారులు లేక వాయిదా పడిన గ్రామా సభ



రెబ్బెన మండలలోని రెబ్బెన గ్రామా సభ మంగళవారం రోజున జరగాల్సి ఉండగా, అధికారులు సభకు హాజరు కాకా పోవడంతో ప్రజలు వారి సమస్యల ఎవరికి  చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయారు, గ్రామా సభకు నాయకులూ తప్ప అధికారులు రాక పోవడంతో నాయకులూ కూడా విస్తుపోయారు, దీంతో చేసిది ఏమిలేక నాయకులే ప్రజాసమస్యలను తెలుసుకొని పై అధికారులకు సమస్యలపై పిర్యాదు చేసారు. 

కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంకు ప్రహరి గోడ నిర్మించాలి: అ.భా.వి.స.


రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్ధి సమాఖ్య మంగళవారం రెబ్బెన మండల డిప్యూటి తహసిల్దార్ రామ్ మోహన్ రావు కు వినతి పత్రం సమర్పించారు, అ.భా.వి.స. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ మరియు పూదారి సాయి మండల అద్యక్షులు మాట్లాడుతూ కస్తూరిబా గాంధీ బాలికల విద్యలయంకు ప్రహరిగోడ లేకపోవడంతో విద్యార్థినులు రాత్రిపూట భయబ్రాంతులకు గురౌతున్నారు అని వారు తెలిపారు, అదే విధంగా రాత్రి సమయంలో పాటశాల ఆవరణం లో పొలిసు పెట్రోలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేసారు.