Saturday, 8 July 2017

సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం ; డీపిఓ గంగాధర్ గౌడ్

సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం ; డీపిఓ గంగాధర్ గౌడ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 08 (వుదయం ప్రతినిధి) ; సమిష్టి కృషితో ఆదర్శ గ్రామం గా తీర్చి దిద్దుదాం అని  డీపిఓ గంగాధర్ గౌడ్ అన్నారు. శనివారం  రెబ్బన గ్రామా పంచాయితీ కార్యాలయం  లో నూతన గ్రామా జ్యోతి  కమిటీని ఏర్పాటు  చేసి  దత్తత తీసుకున్న గ్రామం లోని  అభివృద్ధి కార్యక్రమాల ఫై సమీక్ష నిర్వహించారు.గ్రామం లో 100 శతం ఓడీఫ్ పథకం లో మరుగుదొడ్లను నిర్మించినట్లు తెలిపారు. పారిశుధ్యం, మంచినీటి ఏర్పాటు లో అభివృద్ధిని సాధించాం అన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పేసరి వెంకటమ్మ, ఏఎంసీ వైస్ చెర్మన్ కుదారపు శెంకరమ్మ, ఉప్పసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, పంచాయితీ సెక్రేటి మురళీధర్, వెంకటేశ్వర్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్,చిరంజీవి,చెంద్రకళ,గ్రామస్థులు పాల్గొన్నారు 

హరితహారం లో అందరూ పాలుపంచుకోవాలి ; జీఎం రవిశంకర్

హరితహారం లో అందరూ పాలుపంచుకోవాలి ; జీఎం రవిశంకర్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 08 (వుదయం ప్రతినిధి) ;  మానవాళి మనుగడకు ప్రాణాధారమైన గాలి,నీరు రాను రాను మన అజాగ్రత్తవల్ల కలుషితమైపోతున్నాయి  మనముందుతరాలవారికి స్వచ్ఛమైన గాలిని వారసత్వంగా అందించే భాద్యత మన అందరిదీ.  ఈ ప్రయత్నంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాల్సి ఉందని శనివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడిన సింగరేణి సంస్థ గోలేటి ఏరియా జి ఎం  రవిశంకర్ తెలిపారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో బెల్లంపెల్లి ఏరియా లో ఏడూ లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధంగాఉంచినట్లు తెలిపారు. కార్మికులు అధికారులు గనుల ఫై వారి ఇంలల్లో మొక్కలను నటి హరితహారం హరియతాహార కార్యాక్రమాన్ని విజయవంతం చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం  కొండయ్య, డిజిఎం పర్సనల్  చిత్తరంజన్ కుమార్   న్నారు

Friday, 7 July 2017

రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి

రైతులు పంటలపై బీమా తప్పనిసరి చేయిచాలి 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ;    రైతులకు పంటలపై బీమా తప్పనిసరి చేయించాలని డివిజన్ వ్యవసాయ  అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు శుక్రవారం రెబ్బన మండలం లోని గంగాపూర్ లో పంటల బీమా వలన ప్రయోజనాల గురుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన ఫసల్ భీమా పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ఖరీఫ్  సీజన్ లో సాగు చేస్తున్నటువంటీ వరి, జొన్న మక్కజొన్న, కంది, పెసర, పత్తి, సోయాబీన్ పంటలకు ఫసల్  భీమా పథకంలో ఈ నెల 31వరకు పంట భీమా చేసుకోవచ్చని తెలిపారు ఏలంటి ప్రకృతి వైపరీత్యాల వాళ్ళ సరైన దిగుబడి రాణి యడల ఈ పథకం లో భీమి చేసిన వారికీ ప్రభుత్వం తరఫు నుంచి కొంత మోతాదుకిలో ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ రవీందర్ . ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ . మండల వ్యవసాయ అధికారి  మంజుల,  ఏఈఓ మార్క్ బిటిఎం గురుమూర్తి ,  తదితరులు  పాల్గొన్నారు.

రహదారి  సమస్యను పరిష్కరించాలని వినతి 

రహదారి  సమస్యను పరిష్కరించాలని వినతి 


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 07 (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్,నవేగం గ్రామాలకు వెళ్లే రహదారిని కొంతమంది కబ్జా చేసి,ఆ భూమిని కోల్డ్ స్టోరేజ్ భవనం  నిర్మించారని దాని వల్ల గ్రామంలోకి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంతున్నామని రాంపూర్,నవేగం,కొండపల్లి గ్రామాల ప్రజలు శుక్రవారం రెబ్బెన తహశీల్ధార్ కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ చౌహన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతు గత కొన్నేళ్ల నుండి మూడు గ్రామాల ప్రజలం కోల్డ్ స్టోరేజ్ భవనం నిర్మించిన స్థలంలో పశువులు పోవుటకు సదరు ఉండేదని,అట్టి సదరు భూమిని కొందరు  అన్యాయంగా ఆక్రమించడంతో  పశువులను మేపుటకు తీవ్ర ఇబ్బంధులు పడుతున్నామని ,అక్కడ జరిగిన ఆక్రమణ,కబ్జాను గుర్తించి,వారి పై చట్టరీత్య చర్యలు తీసుకొని,తమకు న్యాయం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తులసీరామ్,వడై అరుణ్ కుమార్,పోశెట్టి,బిక్కు,వెంకటి,రామయ్య,గురువయ్య,రాజుబాబు,గ్రామస్థులు,రైతులు పాల్గొన్నారు. 

Thursday, 6 July 2017

రాష్ట్ర మేదరి సంఘ సర్వ సభ్య సమావేశం

రాష్ట్ర మేదరి సంఘ సర్వ సభ్య సమావేశం 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 06 (వుదయం ప్రతినిధి) ;  తెలంగాణ రాష్ట్ర  మేదరి సంఘం సర్వసభ్య సమావేశం శనివారం  నాడు హైదరాబాద్ మూసారాంబాగ్ లో  జరుగుతుందని  జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో  తెలిపారు.ఈ సమావేశంలో మేదరుల జీవన స్థితిగతులు,మేదరులను ఎస్  ట్  లో చేర్చుట,మేదరులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు మరియు నూతన కమిటీ  మొదలగు అంశాలపై చేర్చ జరగనున్న నేపథ్యంలో  జిల్లాలోని మేదరి సంఘాలు మరియు అనుబంధ సంఘాల అద్యక్షులులు,కార్యదర్సులతో సహా కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని తెలిపారు.

దోమలు ప్రబలకుండా నివారణ మందు పిచికారి

 దోమలు ప్రబలకుండా నివారణ మందు పిచికారి  



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై 06 (వుదయం ప్రతినిధి) ; వర్షాకాలం లో రోగాల నివారణ కి ముందు జాగ్రత్త చెయ్యగా రెబ్బన మండలం లో మురుగు కాలువల నీటి గుంట్టల ఫై సర్పంచ్ పెసరి వెంకటమ్మ ఆధ్వర్యం లో దోమల మందు పిచ్కారిని నిర్వహించారు  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం లో రోగాలు సోకె ప్రమాదం ఉన్నందున నీటి నిలువ ఉన్న ప్రాంతాల లో మరియు డ్రైనేజిలో దోమల పిచికారి చేపడుతున్నాం అన్నారు దీంతో దోమలు అంతరించి పోతాయని దోమలు అంతరించడం తో వ్యాధులు కూడా సోకె ప్రమాదం తక్కువగా ఉంట్టదని అన్నారు ఈ కార్యక్రమం లో సింగల్ విండో డైరెక్టర్ పెసరి  మధునయ్య  పంచాయితీ సిబ్బంది ఉన్నారు.  

Wednesday, 5 July 2017

వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యం లోవిద్యా సామాగ్రి పంపిణి

వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యం లోవిద్యా సామాగ్రి పంపిణి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  05 (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలలోని వంకులం ప్రాథమిక పాఠశాలలో వేకువ ఫౌండేషన్ వారు విద్యార్థిని విద్యార్థులకు  ఉచిత నోటు పుస్తకాలు . మరియు   పలకల పంపిణి చేశారు. ఖతార్లో నివసిస్తున్న  తెలంగాణ వాస్తవ్యుడు వెంకట్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వారి ప్రతినిధి అవధూత శ్రీనివాస్ వంకులం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థిని విద్యార్థులకు  ఉచిత నోటు పుస్తకాలు . మరియు   పలకల పంపిణి చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బం  పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు  డీ జ్యోతి  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న  విద్యార్థిని విద్యార్థులకు వేకువ ఫౌండేషన్ వారు అందివస్తున్న సహకారం ప్రశంసనీయం ఆని అన్నారు.

పథకాలన్ని సక్రమంగా అమలు చేయాలి ; ఎ ఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

పథకాలన్ని సక్రమంగా అమలు చేయాలి ; ఎ ఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  05 (వుదయం ప్రతినిధి) ;  జిల్లాలో మంజూరైన బెస్ట్ ఆవలెబుల్ పాఠశాలల పథకాన్ని కనీస వసతులు ఉన్న పాఠశాలలకె మంజూరు చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో డిటిడివొ జిల్లా అధికారి క్రిష్ణనాయక్ కు వినతి పత్రం అందించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన బెస్ట్ ఆవలెబుల్ పాఠశాలలను అన్ని వసతులు ఉన్న పాఠశాలలకె మంజూరు చేయాలని,రేకుల షెడ్ లు ఉన్న పాఠశాలలకు,ప్రహరీ గోడలు లేని పాఠశాలలకు,మంచి నీటి సౌకర్యం లేని పాఠశాలలకు, మరుగుదొడ్లు లేని పాఠశాలలకు అవకాశం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎఐఎస్ఏఫ్ ఆద్వర్యంలో చేసే ఆందోళనలకు అధికారులె బధ్యత వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ నాయకులు ప్రణయ్, సాయి,తదితరులు పాల్గొన్నారు.

ఆర్ ఎం పి ,పి ఎం పి ల మండల సమావేశం

 ఆర్ ఎం పి ,పి ఎం పి ల మండల సమావేశం


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  05 (వుదయం ప్రతినిధి) ;   ఆర్ ఎం పి ,పి ఎం పి ల సమావేశం రెబ్బన లో  బుధవారం నాడు  మండల అధ్యక్షుడు రాపర్తి సంతోష్,కో ఆర్డినేటర్ చంద్రగిరి శ్రీనివాస్ అధ్యక్షతన  నిర్వహించారు. ఈ  సమావేశం లో జిల్లా అధ్యక్షుడు అజయ్ ముఖ్య అతిథి గా హాజరై  మాట్లాడారు. గతసంవత్సరం జూన్ నెలలో జి ఓ నో 428 అమలు చేసి ర్ ఎం ప్  ప్ ఎం ప్ లకు తెలంగాణ రాష్ట్రం లో 17 కేంద్రాలు ప్రారంభిస్తూ ఆలాగే శిక్షణ నిమిత్తం 46 లక్షల బుడ్జెట్ని ఇవ్వడం జరిగింది దాని  తెలిపారు.  ఈ సభాముఖం గ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు కృతఙ్ఞతలు తెలిపారు ఇదివరకు శిక్షణ మధ్యలో ఆపేసినవారికి,కొత్తగా చేసేవారికి అవకాశం కల్పిస్తామని తెలియజేసారు. ఆలాగే తెలంగాణ ర్ ఎం ప్ ప్ ఎంపీ సంఘ అభివృద్ధికి చేయూతనిస్తూ తగిన గుర్తింపుపత్రాలు అందజేయాలని మానిఫెస్టోలో పెట్టడం గర్వించదగ్గ విషయం అన్ని అన్నారు, ఈ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఎం ఎల్ ఏ   కోవలక్ష్మి గారు ఊడడము అదృష్టం అని అన్నారు.  మండలం లోని ఆర్ ఎం పి  పీఎంపీ లకు శిక్షణ ఇచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు ఈ విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి  లక్ష్మారెడ్డిగారు,భారీనీటిపారుదల శాఖ మంత్రి  హరీష్ రావు గార్లను కొమరం భీం జిల్లా ప్రధానకార్యదర్శి మెహ్రాజ్ హుస్సేన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రూపునర్ రమేష్ లతో కలిశామని పేర్కొన్నారు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు  తెలిపారు. ఆలాగే పురాణం సతీష్ గారు శాసన మండలిలో  ఆర్ఎంపి పిఎంపి  లకు జీవన బృత్తి  కల్పించాలని కోరడం గొప్పవిషయం అని అన్నారు ఆసిఫాబాద్ లో  శాశ్వత భవనం నిర్మాణానికి గాను ఎమ్మెల్యే  మరియు ఎమ్మెల్సీ  గార్లు 4 గుంట్టల  స్థలం మరియు 5 రూపాయలు ఇస్తామని హామీ ఇత్చారని   తీలిపారు. ఎమ్మెల్యే  కోనప్ప గారు బెజ్జురు కౌటాల మండలాలలో సంఘ భవనాలను నిర్మించి ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ఈ సమావేశం లో ,గౌరవ అధ్యక్షులు బి అర్జయ్య ,కమిటీ సభ్యులు,మరియు మండలం లోని ఆర్ఎంపి పిఎంపి పాల్గొన్నారు. 

Tuesday, 4 July 2017

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణి

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  04 (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండల కేంద్రం లోని  జూనియర్ కళాశాలకు ఇంటర్మీడియేట్ జిల్లా నోడల్ అదికారి  ఏ గోపాల్ మంగళవారం విచ్యేసి ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రధశక్తులతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని సూచించారు  అనంతరము నంబాల ,గంగాపూర్ గ్రామాలను సందర్శించి అక్కడ పడవ తరగతి ఉత్తీర్ణులైన  పిల్లలకు ,వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం అందిస్తున్న  ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాల మరియు ఇతర సౌలభ్యాల  గురించివివరిస్తూ . పిల్లలందరిని ప్రభుత్వ కళాశాల లో చేరాలని కోరారు.

జక్కులపల్లి లో రైతు సమగ్ర సర్వే

జక్కులపల్లి లో రైతు సమగ్ర సర్వే

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  04 (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం లోని జక్కులపల్లిలో గ్రామసభ మంగళవారం రెవిన్యూ మరియు వ్యవసాయశఖ  అధికారులు  సంయుక్తం గ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పంటల వివరాలు,పంటభూముల వివరాలు సేకరించారు. రైతుల కోసం నిర్వహించే గ్రామా సభలకు తప్పకుండా రైతులు హాజరయ్యి  సహకరించాలని కోరారు.భూముల పూర్తి వివరాలు తెలుసుకోవడానికి,భూముల క్రమబద్దీకరణ  ఎంత శాతం వున్నదని తెలుసుకోవడం కోసం రైతు సమగ్ర సర్వే ఉపయోగపడిందని  అన్నారు..గత నెల నిర్వహించిన రైతు సమగ్ర సర్వే లో రైతులందరూ నమోదు చేసుకోవడం జరిగింది,ఆ సందర్బంగా నమోదు చేసిన వివరాలు సక్రమమైనవ,కాదా అని పరిశీలించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ చేపట్టిన రైతు సమగ్ర సర్వే వివరాలను క్షున్నంగా  పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భీమేష్, గ్రామా రెవెన్యూ  అధికారి  ఉమ్లాల్, వ్యవసాయ అధికారిణి  మంజుల  వ్యవసాయ విస్తరణాధికారి అర్చన ,గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.

ప్రజా విశ్వాసమే పోలీసు వ్యవస్థకు నూతన ఉత్తేజం – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

ప్రజా విశ్వాసమే పోలీసు వ్యవస్థకు  నూతన  ఉత్తేజం – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  04 (వుదయం ప్రతినిధి) ; జిల్లా కేంద్రము లోని పోలీసు కార్యాలయంలో జిల్లాఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ పిఎస్  గారు ప్రజాఫిర్యాదుల విభాగం ను నిర్వహించి  ,ప్రజాఫిర్యాదు  కు వచ్చిన ఫిర్యాదు దారులనుంచిఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజా ఫిర్యాదు కు జిల్లా నుంచి మొత్తం 14 మంది వచ్చారు ఇందులో  ప్రజా ఫిర్యాదు కు వచ్చిన పెందూరు యెశ్వంత్ రావు సిర్పూర్ (U) మండలము నేటి గూడ గ్రామము లొ గ్రామా పటేలులు అందరు కలిసి తన కుటుంబం ను గ్రామా బహిష్కరణ చేసారని ,గ్రామము లోని మంచి నీటి ను కూడా వాడుకోకుండా అడ్డుకుంటున్నారని  ఎస్పి ఎదుట విలపించగా స్పందించిన జిల్లా ఎస్పి తక్షణము అధికారులను ను ఆదేశించి కుల ,బహిష్కరణ నెపంతో వారి యొక్క హక్కులను హరించే వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపర మైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు, గోలేటి గ్రామము నకు జిల్లెల  రాజు  s/o నాగులు ను ఉద్యోగము ఇప్పిస్తాము అని మోసం చేసి డబ్బులను కాజేశారు అని న్యాయం జరిపించాలని జిల్లా ఎస్పి ను ప్రజా ఫిర్యాదు లొ వేడుకున్నారు ,స్పందించిన జిల్లా ఎస్పి విచారణ జరిపి తక్షణము న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇచ్చారు. ఈ సందర్బముగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లా లో వ్యవసాయ ఆదారిత కుటుంబాలు ఎక్కువగా వున్నాయని వ్యవసాయము పైన ఆదారపడిన కుటుంబాలు తమ తో పాటు వ్యవసాయ పనులకు పిల్లలను తీసుకువెళ్ళి పనులు  చేయించ   కుండా , వారి భవిష్యతు గురించి తెలిపి  విధి గా వారిని బడులకు పంపేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ,తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు, జిల్లా లొ నిరుపయోగముగా వున్నా బోర్ బావులను మూసి వేసేలా చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు,ఆసిఫాబాద్ టౌన్  సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యామ్ సుందర్ ,డిసీబీఎసై రాణాప్రతాప్  అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్  ప్రహ్లాద్,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి  కోర్  శ్రీనివాస్,పిఆర్.ఓ మనోహర్ లు మరియు ఫిర్యాదుల విభాగంఅధికారిని సునీత గార్లు పాల్గొన్నారు.

Saturday, 1 July 2017

సమిష్టి కృషితో లక్ష్యానికి మించిన ఉత్పత్తి ; జి ఎం రవిశంకర్

సమిష్టి కృషితో లక్ష్యానికి మించిన ఉత్పత్తి ; జి ఎం రవిశంకర్  

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూలై  01 (వుదయం ప్రతినిధి);    కార్మికులు,అధికారుల సమిష్టి కృషితోనే సింగరేణి  సంస్థలో లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించగలిగామని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవిశంకర్ తెలిపారు.  శనివారం రెబ్బెన మండలం లోని గోలేటి  జి ఎం  కార్యాలయంలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూన్ మాసంలో నిర్దేశిత లక్ష్యమైన 490000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికిగాను 620480 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించి 127 శాతం తో సింగరేణి మొదటిస్థానం లో నిలవడం జరిగిందన్నారు. గతసంవత్సరం తో పోలిస్తే 24 శాతం అధికంగా ఉత్పత్తి సాధించామని తెలిపారు. రవాణా విషయం లో కూడా 600000 టన్నులు అదనంగా రవాణా చేయడం జరిగిందన్నారు జూన్ నెలలో వర్షం, సమ్మె ఉన్నప్పటికీ కార్మిక సోదరులు విధులకు హాజరై 12 శాతం వృద్ధిని సాధించి ,127,107 రేకులు రవాణా ఉత్పత్తి కి సహకరించారన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు,అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనెల 15 న డైరెక్టర్ గారిచే స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆలాగే ఆసుపత్రి ఆధునికీకరణ ,కమ్యూనిటీ హాల్ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు  సింగరేణి సేవాసమితి ఆధ్వర్యం లో  నిరుద్యోగ యువతి యువకులకు వివిధ వృత్తివిద్యా కోర్సులలో శిక్షణ తరగతులు చేపడుతున్నట్లు తెలిపారు. హరిత హారం కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో 650000 పూలు పండ్లమొక్కలు పంపిణీకి సిద్ధంగాఉంచినట్లు  తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జిఎం  కొండయ్య  ఏ ఈడ యోహాన్, డీజీఎంలు రామశాస్త్రి ,సుదర్శన్ ,  డీ వై  పీఎం  రాజేశ్వర్ , ఏరియా ఇంజనీర్ రామారావు , సింగరేణి  సేవ కో ఆర్డినేటర్ కుమార స్వామి లు పాల్గొన్నారు.