Wednesday, 6 July 2016

రెబ్బెనలో గ్రామసభ

రెబ్బెనలో గ్రామసభ 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన గ్రామ పంచాయితీలో నిర్వహించిన గ్రామ సభలో  గ్రామ ప్రజలు అంతర్గత రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని , గ్రామాధికారులను నిలదీశారు . మంగళ వారము నిర్వహించిన గ్రామ సభలో  మురికి కాలువలు రోడ్లపై వర్షం కురిసిన నీరు  నిలుచి  నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు . అర్హులైన వారికి  పెన్షన్లు , మరుగు దొడ్ల బిల్లులు , ఇంకుడు గుంతల బిల్లులు రాలేదని ప్రజలు తెలిపారు . కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ పెన్షన్ల బిల్లులు , మరుగు దొడ్ల బిల్లులు రాణి వారికి త్వరలోనే వస్తాయని అన్నారు . వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మురికి కాలువలు శుభ్రం చేశామని , బిలీచింగ్ పౌడర్ చల్లమని అన్నారు బురద అయ్యే రోడ్లపై మట్టిని పోపించి బురద కాకుండా చేస్తామని ,ప్రజలు యొక్క సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం తీర్మానం చేయించి పనులు సకాలంలో చేస్తామన్నారు అలాగే వర్ష కాలం దృష్టిలో ఉంచుకుని నీరు కలుషితం కాకుండా బావులలో  బిలీచింగ్ పౌడర్ ను వెయ్యాలని పౌడర్ పొట్లాలను  ప్రజలకు పంచిపెట్టారు   ఈ కార్య క్రమములో సర్పంచ్ వెంకటమ్మ , వైస్ ఎం పి పి   జి రేణుక , ఏ  పి  ఎం వెంకటరమణ ఎఫ్ ఏ తుకారాం,ఏ ఎన్ ఎం లు ,అంగన్వాడీ కార్యకర్తలు,పాఠశాల ప్రధాన ఊపాద్యాయులు ,వార్డ్ మెంబర్లు తదితరులు గ్రామప్రజలు పాల్గొన్నారు.

Monday, 4 July 2016

ఎన్ ఎస్ యూ ఐ మైనార్టీ మండల కమిటీ ఎన్నిక


ఎన్ ఎస్ యూ ఐ  మైనార్టీ మండల కమిటీ ఎన్నిక 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన  మండల  కేంద్రంలో ని ఆర్ అండ్ బీ వసతి గృహంలో సోమవారం ఎన్ ఎస్ యూ ఐ మైనార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భర ద్వాజ్ ఓ ప్రకటన తెలిపారు అధ్యక్షులు గా మహ్మద్ జుబేర్ ఉపాధ్యక్షులుగా మహ్మద్ జమీర్ ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజహర్ కార్యదర్శి గా సయ్యద్ సమీర్ కార్యదర్శిగా బబ్బులును ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా దుర్గం భర ద్వాజ్ మాట్లాడుతూ పార్టీ బలోపేయటం  ప్రతి కార్యకర్రంలో సైనికుల  చేయాలని అలాగే విద్యార్థుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తామన్నారు. 

హరిత హారంలో మేము ముందుంటాం ; కళాశాల విద్యార్థులు

హరిత హారంలో మేము ముందుంటాం ; కళాశాల  విద్యార్థులు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  హరిత హారంలో మేము ముందుంటామని రెబ్బెన ప్రభుత్వ కళాశాల యూవతి యువకులు నినాదాలు చేస్తూ నూతనంగా నిర్మించినా కళాశాల భవనం వరకు సుమారు రెండు కిలో మీటర్లు కాలినడకన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్స్ పాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసి ఆర్ కలలు కన్నా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ప్రతి గ్రామం పచ్చదనంతో నిండి హరిత హారంలో భాగంగా రాష్ట్రమంతటా హరిత వనంకావాలని కొత్త కళాశాల చుట్టూ విద్యా బోధకులు మరియు విద్యార్థులు  చెట్లు పెట్టి పచ్చదనాన్ని నింపారు ఈ  కార్యకరంలో విద్యా బోధకులు రాజకుమార్, ప్రవీణ్, గంగాధర్, ప్రకాష్, అమరేందర్ రెడ్డి, శ్రీనివాస్, రామారావ్, జాన్సీ , మంజుల, మల్లీశ్వరి, సంధ్య రాణి, శాంత మరియు విద్యార్థులు పాలుగోన్నారు.

Sunday, 3 July 2016

ప్రజలు కోసం పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్

ప్రజలు కోసం  పోలిసులు ; ఎం పి పి సంజీవ్ కుమార్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని ఎడవెల్లి  గ్రామలో  జన మైత్రి సభ ఆదివారం  రెబ్బెన ఎస్ ఐ సురేష్, ప్రొఫెషనల్ ఎస్ ఐ శ్రీకాంత్ అద్వర్యం లో  ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి గా ఎం పి పి సంజీవ్ కుమార్ హాజరై  మాట్లాడరు. జనం కోసం  పోలిసులు ప్రతినిత్యం పాటుపడుతూ   ఫ్రెండ్లిగా ఉంటారని,  ఏ సమస్యలు వచ్చిన  సమస్యలు పరిష్కరిస్తారు.  ప్రజలు భయాన్ని విడి పోలీసులకు  ఎలాంటి సమాచారం  అయినా అందించాలని, వారు మీకోసమే వుంటూ  గ్రామ  శాంతి భద్రతలు  తోడ్పడతరు అన్నారు.   ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ కార్నాథం సులోచన ,గ్రామ పోలీస్ అధికారి సుభాష్ మండల్ ,పోలీస్ సిబ్బంది , గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

Saturday, 2 July 2016

ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు సయ్యద్ ముజాయిద్ ఎంపిక


           ఎన్ ఎస్ యూ ఐ  అధ్యక్షుడు  సయ్యద్ ముజాయిద్   ఎంపిక 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలం కేంద్రం లోని స్థానిక వసతి గృహ యందు ఎన్ ఎస్ యూ ఐ  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  ఒక ప్రకటనలో తెలిపారు మండల ఎన్ ఎస్ యూ ఐ  నూతన అధ్యక్షునిగా సయ్యద్ ముజాయిద్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు ఉపాధ్యక్షునిగా తోట సాయి కృష్ణ ప్రధాన కార్యదర్శులుగా చిలువూరి సాయి వికాస్ ,వివేక్ అదేవిధముగా పట్టణ అధ్యక్షునిగా తా  క్సంజ రజినీకాంత్ ,కార్యదర్శి గా శేఖర్ లను ఎన్నుకున్నట్లు తెలిపినారు నూతనముగా ఎన్నికైనా వారు నమ్మకంతో పదవులు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు విద్య సంస్థల విద్యార్థుల సమస్యల పై పోరాడతామని అదే విధముగా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి నిరంతరం కృషి చేస్తామని నూతనముగా ఎన్నికైన వారు తెలిపిపారు.  

ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదు----- ఎస్ ఐ టి రావు

ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదు----- ఎస్ ఐ టి రావు 



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;;  ఆటోలలో పరిమితికి మించి కూర్చోరాదని, అతివేగముతో వాహనాలు నడపరాదని  ఎస్సై టీవీ రావు ప్రొబిషినరీ ఎస్సై శ్రీకాంత్ లు  వాహనాలను శనివారం  రెబ్బెన ప్రధాన రహదారిమీద  గోలేటి క్రాస్ రోడ్  వద్ద వాహనాలను తనిఖీ కార్యక్రమంలో  అన్నారు. ఆటోలకు  వాహన పత్రాలను, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహనాలు పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని, ప్రతి డ్రైవర్ కి డ్రెస్ కోట్ కలిగి ఉండాలని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు.

నవేగం లో పశువైద్య శిబిరం

నవేగం లో పశువైద్య శిబిరం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో శనివారం నవేగంలో పశు వైద్య  శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ  టీకాలు వేయడం జరిగిందన్నారు.  గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 314 పశువులకు టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలోసర్పంచ్ దోమల మల్లికాంబ  పశు వైద్య సిబ్బంది  నజీర్ ,షహీదా ,బిక్కు ,విశ్వనాథ్ మరియు  తదితర రైతులు ఉన్నారు  

కుక్కల దాడిలో గాయపడిన దుప్పి

 కుక్కల దాడిలో గాయపడిన  దుప్పి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన మండలంలో ని గోలేటి గ్రామ పంచాయితీ రేగుల గూడెం లోని దుప్పిని  కుక్కల దాడి చేస్తుండగా కుక్కల దాడిలో గాయపడిన  దుప్పిని  కొంత మంది యువకులు కాపాడారు యువకులు  ఇచ్చిన సమాచారం మేరకు  ఫారెస్ట్ అధికారులు  డి పి ఆర్  ఓ శ్రీనివాస్ ,బిట్ అధికారి మహమ్మద్ షరీఫ్ స్థానిక పశు వైద్య శాలకు తరలించి చికిత్స  జరిపించారు అనంతరం  ఉన్నత  అధికారి వినయ్ కుమార్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ ప్రాంతం కు తరలిస్తామన్నారు.

సీనియర్ డాక్టర్స్ కి ఘన సన్మానం

  సీనియర్ డాక్టర్స్ కి ఘన సన్మానం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) ;రెబ్బెన  మండలంలోని గోలేటిలో స్నేహ కల్చరల్ ఆర్ట్స్ &సేవ సంస్థ ఆధ్వర్యంలో  డాక్టర్ డే  పురాస్కారించుకొని సీనియర్ ఆర్ ఎమ్ పి  డాక్టర్స్ కి మంద మల్ల రెడ్డి ,వెంకటాచారి లకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భముగా మహిళా కార్యదర్శి ,ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ   డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తూ కనిపించని దేవుడి కన్నా ప్రేమతో చికిత్స చేసే డాక్టర్  దేవుడి తో సమానం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో   సంస్థ అధ్యక్షులు బి గోపాల కృష్ణ , ఎమ్ పి టి సి పర్లపల్లి వనజ ,స్వామి గౌడ్ ,నవీన్ ,దేవక్క, శంకరమ్మ ,లక్మి తదితరులు పాల్గొన్నారు.

Friday, 1 July 2016

పోలీస్ స్టేషన్ లో ఇఫ్తార్ విందు

పోలీస్ స్టేషన్ లో ఇఫ్తార్ విందు


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నాడు ముస్లీమ్ సోదరులకు రెబ్బెన ఎస్సై టివి రావు మరియు ప్రొబిషినరీ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విందు కార్యాక్రమం నిర్వహించారు. విందులో పాల్గొని ఎంపిపి సంజీవ్ కుమార్, జడ్పిటిసి బాబురావు, జామా మసీద్ ఇమాం సాబ్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్ష చేస్తూ రంజాన్ నాటికి అయిపోతుందని అన్నారు.   ఈ కార్యాక్రమంలో చిరంజీవి, మూడెడ్ల రాజేందర్, పల్లె రాజేశ్వర్, మధనయ్య, జాకీర్ ఉస్మాని, సలీం, ఎజాజ్, జంషీద్ అలీ, జహూర్, ఫిరోజ్, జలీల్, ఉబేదుల్లా, జబీ, బాబ్బు, చోటు, నదీమ్, జమీర్, షబ్బీర్, గౌస్, సమీర్, ముస్లీమ్ సోదరులు పాల్గొన్నారు.

పశువైద్య శిబిరం

 పశువైద్య శిబిరం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో కిష్టాపూర్ జక్కులపల్లి  శుక్రవారం సర్పంచ్ బీమేష్  ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది పశు వైద్య  శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 523 పశువులకు ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలో పశు వైద్య సిబ్బంది  నజీర్ ,షహీదా ,బిక్కు ,విశ్వనాథ్ మరియు  తదితర రైతులు ఉన్నారు  

సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో సంక్షేమానికి పెద్ద పీట


సింగరేణి బెల్లంపల్లి ఏరియాలో   సంక్షేమానికి పెద్ద పీట  


(రెబ్బెన వుదయం ప్రతినిధి)  సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోకార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు     
  బెల్లంపల్లి ఏరియా జి  ఎమ్ రవిశంకర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి  జి  ఎమ్ కార్యాలయం లో శుక్రవారం  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.  రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తితో పాటు   పటు కార్మికుల సంక్షేమం కోసం,ప్రతి నెల సేవ సమితి ఆధ్వర్యంలో , యోగా శిబిరాలు, ఆయుర్వేదిక శిబిరాలు ,నిరుద్యోగ యువతి యువకులకు ఉచితముగా కానిస్టేబుల్ ,ఆర్మీ ,వృత్తి కోర్సులకు శిక్షణ ఇస్తున్న మన్నారు . బెల్లంపల్లి ఏరియా లోని ఆసుపత్రుల భవన నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించి మరమత్తులు చేయిస్తామన్నారు   అర్ ఓ అర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటిని అందచేయడం జరుగుతుందన్నారు డోర్లి 1,2 మధ్య గుట్ట భాగంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు తెలవడంతో గుట్ట భాగానికి డ్రిల్ చేసి నిక్షేపాలని వెలికి తీస్తామన్నారు అదేవిధముగా ఉపరితల గనులలో నుంచి బయటికి తోడే నీటి పంపులను మరమత్తు చేపించి మరియొక్క పంపులను అమర్చినట్లు తెలిపారు అలాగే బయటికి తోడేసిన నీటి గళాలో పేరుకుపోయిన ఇసుకను తీపించి శుభ్రం చేయించామన్నారు వచ్చే డిసెంబర్ నెలలో  సి ఎచ్ పి ఏర్పాటు చేసి దుమ్ము దూళి ,మరియు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేస్తా మన్నారు   గోలేటి 1 లో విదులు నిర్వహిస్తున్న బదిలీ కొరకు పెట్టుకున్న వారికీ వారి ఇష్టమున్న చోటికి బదిలిచేయడం జరుగుతుందన్నారు అలాగే విడతల వారీగా పంపించడం జరుగుతుంది అని అన్నారు బెల్లంపల్లి ఏరియా కు ఈ సంవస్తరం నిర్దేశించిన  బొగ్గు ఉత్పత్తి కంటే  ఎక్కవ అభివృద్ధి చెందింది అన్నారు  ఈ కార్యక్రమంలో డి జి ఎం చిత్రంజన్ కుమార్, ఎస్వోటు జి ఎం కొండయ్య,ఐ ఇ డి  యోహాన,  డి వై పి ఎం . రాజేశ్వర్,అనురాధ  తదితరులు పాల్గొన్నారు. 

మైనార్టీ పేద కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ

   మైనార్టీ  పేద  కుటుంబాలకు ఉచిత దుస్తుల పంపిణీ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బన మండలంలో స్థానిక ఎమ్ పి డి ఓ కార్యలయంలో శుక్రవారం  రోజున మైనార్టీ పేద కుటుంబాలకు  ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్ పి టి సి బాబు రావు,రెబ్బెన మండల తహసీల్దార్ రమేష్ గౌడ్ శుక్రవారం ఉచిత దుస్తులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీ  పేద కుటుంబముల కోసం తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్ కార్యక్రమాలు కుల మతలకు అతిహితముగా ఏర్పాటు చేస్తూ మరెన్నో కార్యక్రమాలు చేపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ వైస్ మార్కెట్ చెర్మన్ కుందారపు శంకరమ్మ, వైయస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక,తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్,  సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్ కుమార్ ,మండల కో అప్షన్ సభ్యుడు  జాకీర్ హుస్మాని,జామ మసీద్ కమిటీ అధ్యక్షుడు అజీజ్ ,టి ఆర్ ఎస్ మైనార్టీ మండల అధ్యక్షుడు చోటు , సింగిల్ విండో డైరెక్టర్  మధునయ్య,టి ఆర్ ఎస్ నాయకులు  సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్ ,వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు