బొగ్గు రవాణా కొరకు టెండర్ల ప్రకటన
కొమురం బీమ్ రెబ్బెన (వుదయం) డిసెంబర్ 16 రెబ్బెన లోని గొల్లేటి బెల్లంపల్లి ఏరియా ఖైర్గూడా ఓపెన్ కాస్ట్ నుండి రెబ్బెన సైడింగ్ వరకు రెండు నెలల వరకు మరియు రామకృష్ణపూర్ సి హెచ్ పి వరకు 4 నెలల పాటు బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు ప్రకటించడం జరిగిందని డి జి ఎం పర్సనల్ చిత్తరంజన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్ ఫారంలు గొల్లేటి జి ఎం కార్ర్యలయంలో పర్చేజ్ డిపార్ట్మెంట్ నందు లభిస్తాయని పూర్తి వివరాలు జతచేసిన పారములను ఈ నెల 21తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపు జి ఎం కార్ర్యలయం నందున అందచేయాలన్నారు. అందచేసిన పారములను అదే రోజు సాయంత్రం తెరువబడును అని తెలిపారు. ఈ టెండర్ల పూర్తి సమాచారం కోసం పర్చేజ్ డిపార్ట్మెంట్ కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment