75వ కొమురం భీం వర్ధంతి
కొమురంభీం 75వ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణా విద్యార్ధి వేదిక(టి వి వి) ప్రజస్వమ్యుల ఉపాద్యాయుల సమైక్య సంగం,ఆదివాసీ కొలవార్ సంగం ఆధ్వర్యంలో రెబ్బెన విశ్రాంతి వసతి గృహాంలో కొమురంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రాజ్ కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ జల్జంగల్ జమీన్ కోసం గిరిజనుల హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం చేసిన కొమరంభీం ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు జిల్లా అద్యక్షులు కడతల సాయి,రెబ్బెన మండల అద్యక్షులు పర్వత సాయి,జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవడపు ప్రనీయ్,ఆదివాసి కొలవార్ సంఘ నాయకులు కొడిపే వెంకటేష్,గణపతి,కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment