రెబ్బెన : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్ఎస్యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ సోమవారం పరిశీలించారు. పిల్లలకు మెను ప్రకారం మధ్యాహ్నం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి బోజనం చేశారు. విద్యార్థులకు అందించే ఆహరంలో నాణ్యత ప్రయాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్బు, ముజ్జా, సాయివికాస్, వినయ్, సంజీవ్, హమీద్, రమేశ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment