రెబ్బెన : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని ప్ర తీ ఒక్కరు విజయవంతం చేయాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ అన్నారు. మొక్కలు నాటాలనే నినాదంతో మంగళవారం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటీఓ జీఎం కొండయ్య, డీవై పిఎం సీతారాం, పీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎన్న సదాశివ్, ఏఐటీయూసీ గోలేటిబ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి , పర్యావరణ అధికారి క్రష్ణ మూర్తి, పాఠశాలల హెచ్ ఎం లు సంజీవ్ కుమార్, సుగునాకుమారి, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment