రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని అందరు విజయవంతం చేయాలని రెబ్బెన త హసీల్దార్ రమేశ్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ఫారెస్ట్ నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడితేనే భావితరాలకు బం గారు భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులకు అవగాహన కల్పిస్తే గ్రామ గ్రామాల్లో హరితహారం విజయవంతమవుతుందని, దీని కోసం అధికారులు, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
No comments:
Post a Comment