రెబ్బెన మండలంలోని వ్యవసాయ సహకార బ్యాంకుకు మంగళవారం వచ్చిన జేడీఏ రోజ్లీలాను నిలదీశారు. కొన్ని రోజులుగా ఎరువులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కొరత ఉండడంతో మండలంలోని 12 గ్రామ పంచాయతీల రైతులు నిరాశతో ఎదురుచూస్తున్నారు. జేడీఏ రోజ్లీలాతో రైతులు ఆవేశంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ఎరువుల కొరత లేదని రెండు రోజులలో పంపిస్తామన్నారు. ఆమె వెంట ఏఓ మంజూల, ఏఈఓ మార్క్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment