రెబ్బెన : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ నర్సరీ శుక్రవారం ఎంపీపీ సంజీవ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం లోభాగంగా 80 వేల మొక్కలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఇంటి ఖాళీ పరిసర ప్రాంతాల్లో , రోడ్లకు ఇరువైపుల, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలో మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీ, తహశీల్ధార్ రమేష్ గౌడ్, సింగిల్ విండో డైరక్టర్ మదనయ్య తదితరులు ఉన్నారు.

No comments:
Post a Comment