రెబ్బెన : ప్రభుత్వం దళితులకు మూడేకరాల భూపంపిణీలో భాగంగా రెబ్బెన మండలంలో గల ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పరిశీలించారు. భూములు వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నాయో లేదో నాని ఆరా తీశారు. భూములకు సర్వే జరిపించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరిక యాదయ్య, గ్రౌండర్ వాటర్ ఈడీ కుమార స్వామి, మండల వ్యవసాయ అధికారి మంజూల, ఈపీఓఈపీఎస్ వెంకటీ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment