రెబ్బెన : తహసీల్దార్ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు బోరికర్ వినోద్ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించి, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడిని అరికట్టాలి. జీవో నెంబర్ 6ను సవరించి, కేజీ టూ పీజీ అమలు చేయాలని ఉపాధ్యాయుల పోస్ట్లను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో నాయకులు కస్తూరి రవికుమార్, గోగర్ల రాజేష్, ఊదారి సాయి కిరణ్, మోర్ల తిరుపతి, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment