కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) (జైనూర్) ఏప్రిల్ 6 ; గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మండల పరిషత్ ఉపాధ్యక్షులు షేక్ రషీద్ అన్నారు. శుక్రవారం మండలంలోని డబోలి గ్రామ పంచాయితీ పరిధిలో మంచినీటి ఎద్దడి ఉండటం వలన నీటికి ఇబ్బంది పడుతున్నారని వాటర్ ట్యాంకర్ తో నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.గ్రామాలలో మంచినీటి వనరులు పని చేయక భూగర్భ జలాలు అట్టడుగు పోతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారని తెలిపారు.వీరితో పాటు సర్పంచ్ రాధా బాయి,కార్యదర్శి ఉదయ్ రాంప్రసాద్,కారబరి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

సూపర్
ReplyDelete